Andhra news: సంక్రాంతి స్పెషల్.. 6,400 ప్రత్యేక బస్సు సర్వీసులు

-

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికుల కోసం 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. జనవరి 6 నుంచి 18 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రత్యేకబస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని, ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కూడా ఉందని చెప్పారు. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని వివరించారు.

‘‘62 స్టార్‌లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రవేశపెట్టాం. వచ్చే మార్చి నాటికి కార్గో ద్వారా రూ.165 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పని చేస్తున్నాం. అన్ని బస్సుల్లో ఈ నెలాఖరుకు టిమ్‌ మిషన్లు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆర్టీసీని ప్రైవేటీకరించే యోచన లేదు. పొరుగు సేవల ఉద్యోగులను కూడా తొలగించడం లేదు. ఉద్యోగులకు ఓటీలు, అలవెన్సులు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించాం. వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాం. అలవెన్సులపై ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ కంగారు పడొద్దు. ఆర్టీసీ ఆదాయాన్ని ప్రతిరోజూ ప్రభుత్వానికి చెల్లించే ప్రతిపాదన లేదు.’’ అని ద్వారకా తిరుమలరావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version