తనను కాపాడాలంటూ ఢిల్లీ కోర్టులో కేసు వేసిన ఐశ్వర్యరాయ్ కుమార్తె..

-

Aishwarya Rai: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ మనవరాలు ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ గారాల తనయ ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. తనకు అన్యాయం జరుగుతుందని.. కాపాడాలంటూ ఆమె కోర్టును విన్నవించుకుంది.

ఐశ్వర్యారాయ్, అభిషేక బచ్చన్ గారాల తనయ ఆరాధ్య బచ్చన్ తాజాగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఓ యూట్యూబ్ ఛానల్ టాబ్లాయిడ్‌పై ఈ కేసు పెట్టినట్టు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని, నిరాధారమైన వార్తలు వ్యాప్తి చేస్తూ, తన ప్రైవసీకీ భంగం కలిగిస్తున్నారంటూ ఇలా చేస్తున్న సదరు యూట్యూబ్ టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ కోర్టును వేడుకుంది ఆరాధ్య. కాగా ఈ కేసులో కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

Aishwarya Rai
Aishwarya Rai

 

ఈ కేసులో ఆరాధ్య బచ్చన్ తన ఆరోగ్యం పై వ్యక్తిగత జీవితంపై లేని పోయిన విషయాలు అన్నీ ఆ యూట్యూబ్ ఛానల్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని పేర్కొంది. తాను మైనర్ ని కాబట్టి తన హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అభ్యర్థించింది. ఈ పిటిషన్ లో ఇప్పటికే తన కుటుంబ సభ్యులంతా ఇలాంటి విషయాలను పలుమార్లు ఎదుర్కొన్నారని కానీ తనపై వస్తున్న ఈ విషయాలను మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరింది.

అయితే విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ఇప్పటికే పలుమార్లు ట్రోలింగ్ ఎవరైనా సంగతి తెలిసిందే. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులు వ్యక్తిగత జీవితాన్ని పలు యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో సార్లు ట్రోల్ చేశాయి. ఆరాధ్య ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అంటూ కొన్ని వార్తలు వినిపించగా త్వరలోనే అభిషేక్ ఐశ్వర్య విడాకులు తీసుకుంటారని వార్తలు కూడా వినిపిస్తూ వచ్చాయి. ఈ విషయాలన్నిటిపై అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏమాత్రం మార్పు లేకపోవడంతో ఇప్పుడు ఆరాధ్య కోర్టులో పిటిషన్ వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news