తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

-

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం మంగళవారం రాత్రి వెల్లడైంది. దీంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తొలిసారిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకడంతో కలకలం రేగింది.

ఆ తర్వాత మరో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, గొంగిడి సునీత దంపతులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులకు కరోనా సోకింది. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజా ప్రతినిధులు కూడా కొవిడ్ బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version