ఆర్మీ హెలికాప్టర్ క్రాష్… 14 మందిలో 13 మంది మృతి. ధ్రువీకరించిన తమిళనాడు ప్రభుత్వం.

-

తమిళనాడు నీలగిరి జిల్లాలో సూలూర్ వద్ద జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో సీడీఎస్ బిపిన్ రావత్ తో కలిపి 14 మంది హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు. తాజాగా ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 13కు చేరింది. ప్రస్తుతం బిపిన్ రావత్ ఒక్కరే ప్రాణాలతో భయటపడి చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం కూడా దీనిని ధ్రువీకరించింది. ఘటన సమయంలో తీవ్రంగా మంటలు చెలరేగడంతో మృతదేహాలను గుర్తించేందుకు వీలుగా లేవు. దీంతో మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్ లు చేయాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో మరో మహిళ మృత దేహాన్ని సంఘటన స్థలంలో కనుకున్నరు. ఈమె బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ గా గుర్తించారు. అయితే ప్రస్తుతం సీడీఎస్ బిపిన్ రావత్ పరిస్థితిపై యావత్ భారతదేశంలో ఆందోళన నెలకొంది. బిపిన్ రావత్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్న క్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో ఆయన నివాసానికి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version