BREAKING: ఆరూరి రమేష్ కిడ్నాప్ ?

-

బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పెద్దలు ఆరూర్ రమేష్ ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు. ఆరూరి రమేష్ భార్య ఫోన్ సమాచారంతో ఆరూరి రమేష్ ఇంటికి వచ్చాను అంటున్నారు హనుమకొండ జిల్లా బిజెపి అధ్యక్షులు రావు పద్మ. నిన్న పార్టీ వెళుతున్నట్టు బిజెపి నేతలకు ఆయన క్లియర్ గా చెప్పారని… ఈరోజు పార్టీకి రాజీనామా చేసి మధ్యాహ్నం హైదరాబాద్ లో కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి బిజెపిలో చేరుతానంటూ చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ సమయంలో బీఆర్ఎస్ పెద్దలు ఆరూర్ రమేష్ ను కిడ్నాప్ చేశారని ఫైర్‌ అయ్యారు రావు పద్మ. కాగా…ఆరూరి రమేష్ ను ఇంకా బుజ్జగిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేముందు ఆరూరిని ఇంట్లోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఇవాళ సాయంత్రం హరీష్ రావు వస్తాడని, పార్టీ మారొద్దని ఆరూరికి చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో జై ఆరూరి అంటూ మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు. మరి ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news