హుజురాబాద్ లోనే కాదు యూపీలోనూ బీజేపీకి ఓట‌మి తప్ప‌దు :ఓవైసీ

-

బీజేపీపై ఎంఐఎం నేత హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. హుజురాబాద్ లోనే కాకుండా ఉత్త‌ర ప్ర‌దేశ్ లో కూడా బీజేపీ ఓడిపోతుంద‌ని ఓవైసీ వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో లౌకిక వాదాన్ని…బ‌హుజ‌న‌వాదాన్ని బీజేపీ చెడగొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హుజురాబాద్ ఎన్నిక‌ల్లోనే కాకుండా రాబోయే యూపీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ఓడిపోతుంద‌ని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లీంలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అస‌ద్ వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా తాము ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వంద స్థానాల్లో పోటీచేస్తామ‌ని యోగిని ఓడించ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మని అస‌ద్ వ్యాఖ్యానించారు. త్రిపుర‌లో ప‌దిహేను మ‌సీదుల‌ను ద్వసం చేసార‌ని..అయినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని అస‌ద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద ముస్లీంల‌కు ప‌ది ఇల్లు కూడా రాలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపీకి గుణ‌పాఠం చెబుతార‌ని అస‌దుద్దీన్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news