షాకింగ్ : మహిళా కార్యకర్తను కొట్టిన అశోక్ గజపతి రాజు

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఒక మహిళా మీద టీడీపీ సీనియర్ నేత దాడి చేయడం సంచలనంగా మాటింది. విజయనగరంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు, ఈ క్రమంలోనే ఆయన సహనం కోల్పోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాకు వచ్చిన ఆయనని పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఓ మహిళ అశోక్ గజపతిరాజుపై పువ్వులు చల్లింది. చాలా సేపటి దాకా ఆయన అలాంటివి చల్లవద్దని చెబుతూనే ఉన్నారు, అయినా ఆ మహిళ వినకపోవడంతో ఆయన సహనం కోల్పోయి ఆగ్రహానికి గురై ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాక ఆమె మీద ఒక దెబ్బ కూడా వేశారు. అక్కడే ఉన్న ఇతర నేతలు ఆయనను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఎంతో సౌమ్యుడిగా పేరు ఉన్న అశోక్ గజపతి రాజు ఇలా ఎందుకు చేశారో అనేది చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news