ఆసియా కప్ 2023: కెప్టెన్ షకిబ్ ఒంటరి పోరాటం… !

-

ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన నామమాత్రంగా జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు ఏమంత ఆశించిన భాగస్వామ్యాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్ తో ఇంటెర్నేషన్ డెబ్యూ కు వచ్చిన టాంజిమ్ హాసన్ మూడు ఫోర్లు కొట్టి టచ్ లో ఉన్నట్లే కనిపించిన శార్దూల్ బౌలింగ్ లో వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డ్ అయ్యాడు.. ఇక లిటన్ దాస్ డక్ అవుట్ గా వెనుతిరిగారు. ఆ తర్వాత అనముల్ హాక్ సైతం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన షకీబ్ మరియు మెహిదీ హాసన్ లు కాసేపు ఇండియా బౌలర్లను ప్రతిఘటించిన మెహిదీ హాసన్ అవుట్ అయ్యాడు..

ఆ తర్వాత షకీబ్ మరియు తౌహీద్ హృదయ్ లు వికెట్ పడకుండ అయిదవ వికెట్ కు ఇప్పటికే పరుగులు జోడించి ఒక మంచి స్కోర్ ను సాధించే దిశగా వెళుతున్నారు. ఇక షకీబ్ ఒక్కడే అర్ద సెంచరీ సాధించి ఒంటరి పోరాటాన్ని సాగిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news