ఆసీస్​ స్టార్​ మహిళా క్రికెటర్​ ఎలిస్​ పెర్రీ వివాహ బంధానికి వీడ్కోలు..!

-

ఆసీస్​ స్టార్​ మహిళా క్రికెటర్​ ఎలిస్​ పెర్రీ, తన భర్త మ్యాట్​ టుమువా.. తమ ఐదేళ్ల వైవాహిక బంధానికి గుడ్​బై చెప్పేశారు. వీరిద్దరూ 2015 డిసెంబర్​లో పెళ్లి చేసుకున్నారు. పెర్రీ క్రికెటర్​గా రాణిస్తుండగా.. టుమువా మెల్​బోర్న్​ రెబల్స్​ జట్టు తరఫున ప్రొఫెషనల్​ రగ్బీ ప్లేయర్​గా ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నోరు మెదపని ఈ జంట.. ఆదివారం అనూహ్యంగా సోషల్​మీడియా వేదికగా ప్రకటన చేశారు.

perri
perri

“ఇద్దరం ఒకరి భావాలను మరొకరు గౌరవించుకొని విడిపోదామని ఈ ఏడాది ఆరంభంలోనే నిశ్చయించుకున్నాం. విడిగా జీవించేందుకు ఇదే సరైన నిర్ణయమని అనిపిస్తోంది. ఇద్దరికీ వేర్వేరు జీవితాలు, లక్ష్యాలు ఉన్నాయి. అందుకే ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కష్టమైన సమయం” అని చెప్పుకొచ్చారు. మెల్​బోర్న్​ వేదికగా ఆస్ట్రేలియా క్రికెట్​ అవార్డులకు వెడ్డింగ్​ రింగ్​ లేకుండా పెర్రీ హాజరవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ వేడుకలో ఈ అమ్మడు మూడోసారి బెలిండా క్లార్క్​ అవార్డు అందుకుంది. ఫిబ్రవరి-మార్చిలో జరిగిన మహిళల ట20 ప్రపంచకప్​లో చివరిగా కనువిందు చేసింది పెర్రీ. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడినా.. గాయం కారణంగా ఫైనల్​కు దూరమైంది.

Read more RELATED
Recommended to you

Latest news