మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు అవినాష్ రెడ్డి తల్లి…

-

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల వతేదీ నుండి కర్నూల్ లోని విశ్వభారతి హాస్పిటల్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమె పరిస్థితి కొంచెం నిలకడగా ఉండడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. అయితే ఈమె పూర్తిగా త్వరగా కోలుకోవాలంటే మెరుగైన చికిత్స తీసుకోవడం ఎంతైనా అవసరం అని వైద్యులు సలహా ఇవ్వడంతో ఆమెను హైదరాబాద్ కు తరలించారు. ఇక్కడ గచ్చిబౌలి లోని AIG హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించనున్నారు. ఇక అమ్మ ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకుంటూ అవినాష్ రెడ్డి కూడా ఆమెతోనే ఉన్నాడు. ఇక ఎప్పుడెప్పుడు అవినాష్ రెడ్డి బయటకు వస్తాడా విచారణకు తీసుకువెళదామా అంటూ సిబిఐ ఎదురుచూస్తోంది.

కాగా అవినాష్ రెడ్డిపై మాజీ ఎంపీ వివేకా హత్య కేసు లో కొన్ని విషయాలను తెలుసుకోవడం కోసం సిబిఐ అతన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news