పాపం… “అక్షర్ పటేల్” వరల్డ్ కప్ కల కరిగిపాయె !

-

వన్ డే వరల్డ్ కప్ కు ఇండియా తమ తుది జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతకు ముందు ప్రకటించిన జట్టుకు మరియు కాసేపటి క్రితం ప్రకటించిన జట్టులో ఒక కీలక మార్పును మీరు గమనించే ఉంటారు. ఇందులో బౌలింగ్ ఆల్ రౌండర్ గా ఇంతకు ముందు స్క్వాడ్ లో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కు బదులుగా రైట్ హ్యాండ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను జట్టుకలోకి తీసుకుంది. ఎందుకంటే… అక్షర్ పటేల్ గత రెండు వారాల క్రితం శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయం పట్టేయడంతో ఫైనల్ మ్యాచ్ కూడా ఆడకుండా ఇండియాకు తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి చికిత్సలో భాగంగా బెంగుళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో కోలుకుంటున్నారు. అయితే జట్టును ప్రకటించడానికి ఈ రోజు ఆఖరి తేదీ కావడంతో అక్షర్ పటేల్ కోలుకోలేదని తెలియడంతో అశ్విన్ ను తీసుకుంది.

దీనితో అక్షర్ పటేల్ వరల్డ్ కప్ ఆశలు అన్నీ కూడా కల గా మిగిలిపోయాయి. మరి అక్షర్ పటేల్ కు బదులుగా ఎంపిక అయిన అశ్విన్ ఏ మేరకు రాణిస్తాడు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news