మిస్టర్ జగన్… మగతనం ఉంటే నాపై ప్రతాపం చూపించు – అయ్యన్న పాత్రుడు

-

మిస్టర్ జగన్… మగతనం ఉంటే నాపై ప్రతాపం చూపించు అని ఛాలెంజ్ చేశాడు అయ్యన్న పాత్రుడు. బెయిల్ పై నర్సీపట్నం తన స్వగృహానికి వచ్చిన అనంతరం తన రాక కోసం అభిమానంతో ఎదురుచూస్తున్న నాయకులు కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు అయ్యన్న.నాయకులు, కార్యకర్తల రుణం తీర్చుకుంటాను..నా కుటుంబానికి అండదండగా ఉన్న అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

అయ్యన్న పాత్రుణ్ణి ఏం పీకలేరు కాబట్టి, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు.నీవు దోచుకుంటున్నావు… దాచుకుంటున్నావన్నారు. దాన్ని అవసరమైతే లేదని ఆరోపణలు నిరూపించుకో అంటూ పరోక్షంగా సీఎంకు సవాల్ విసిరారని ఫైర్ అయ్యారు. రోడ్లు మీద గుంతలు పూడ్చలేకపోతున్నావు..ఇసుక అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నావు..పరిపాలన చేతకాక, దాన్ని మభ్య పెట్టేందుకు మా మీద కేసులు పెట్టి ఇంకా ఎన్నాళ్లు ఇలా కాలం గడుపుతారనీ ఆగ్రహించారు. నా మీద 14 కేసులు పెట్టి నన్ను ఏం పీకావు..రేపు 2024లో నిన్ను రాష్ట్రంలో ప్రజలు తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version