తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అజహరుద్దీన్…

-

 

మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కి కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొంటున్న అజహరుద్దీన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అజహరుద్దీన్‌తో పాటూ మరికొందరు నేతలకు కీలక బాధ్యత అప్పగించారు.  అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఎంపీగా 2009లో గెలిచారు. 2014లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్న ఆయన తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ దూకుడు పెంచారు.

అజర్ 2019లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఏఐసీసీ నేడు మరికొంత మందిని వివిధ హోదాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… వారిలో  వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ బీ.ఎం. వినోద్ కుమార్, జాఫర్ జావేద్‌లను నియమించారు. జనరల్ సెక్రటరీలుగా.. ఎస్. జగదీశ్వర్ రావు, నగేష్ ముదిరాజ్, టీ. నర్సారెడ్డి, మానవతా రాయ్, ఫాహీమ్, కైలాష్‌, లక్ష్మారెడ్డి, క్రిషాంక్‌లకు పదవులు ఇచ్చారు. దుర్గం భాస్కర్, దరువు ఎల్లన్న, విజయ్ కుమార్, బాల లక్ష్మీలను సెక్రెటరీలుగా నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news