తెదేపాకు మాజీ మంత్రి గుడ్ బై…

-

రేపు పవన్ సమక్షంలో జనసేనాలోకి..

మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు తెదేపాకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తన ఎమ్మెల్యే పదవికి, తెదేపా  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి…అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి పంపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రావెల.. ఇప్పటికే పవన్‌తో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించినట్లు తెలుస్తోంది.  మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెదేపా తరుఫున ఎమ్మెల్యేగా గెలిచి అనూహ్యంగా కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే వరుస వివాదాలు, వ్యక్తిగత కారణాల వల్ల తెదేపా అధినేత ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు..దీంతో  అప్పటి నుంచి రావెల కిషోర్ బాబు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news