సోలో లైఫే సో బెటర్ అంటున్న బేబీ హీరోయిన్..!

-

ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్లు కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెడుతుంటే ఇక్కడ బేబీ సినిమా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య మాత్రం కుమారి గానే ఉంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి షాకింగ్ కామెంట్లు చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. శ్రావణమాసం వచ్చేసింది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం మహాలక్ష్మీ వ్రతాలు అంటూ ఇల్లన్నీ కూడా పండుగ వాతావరణంతో సందడి చేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలోనే బుల్లితెరపై కూడా పలు ఈవెంట్లు షోలు కూడా సిద్ధం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే స్టార్ మా లో మా వరలక్ష్మీ వ్రతం త్వరలో ప్రసారం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రోమో ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కి ఉదయభాను హోస్టుగా చేస్తోంది. కుమారీలు వర్సెస్ శ్రీమతులు అనే థీమ్ తో పెళ్ళికాని వాళ్లను పెళ్లయిన వాళ్లను తీసుకొచ్చి ఆటలు ఆడించారు. రెండు టీమ్స్ మధ్య రచ్చ మామూలుగా సాగలేదు. దీంతో శివజ్యోతి కి కోపం వచ్చి మీరు కేవలం కుమారీలు మాత్రమే.. అంత బిల్డప్ మీకు అవసరం లేదు అని కుమారీలను ఉద్దేశించి అనేసరికి మీరంతా శ్రీమంతులే.. శ్రీమంతుడు మూవీలో శృతిహాసన్ కాదు.. అంటూ కుమారి ల టీమ్ వార్నింగ్ ఇచ్చింది.

ఇక ఈ కార్యక్రమానికి.. వైష్ణవి చైతన్య కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేసింది. కుమారీలుగా ఉంటేనే లైఫ్ ప్రశాంతంగా ఉంటుందని.. సోలో లైఫే సో బెటర్ అంటూ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదే విషయాన్ని ఉదయభాను కూడా అడిగేసరికి.. ఆమె అవును.. లేదంటే సంకలో పిల్లల్ని ఎత్తుకొని మరో చేతిలో డైపర్లు పట్టుకొని వెళ్తూ ఉండాలి అంటూ చెప్పింది. ఆ తర్వాత ఇదే వేడుకలో అవినాష్ తన భార్య అనుజాకి కూడా సీమంతం వేడుకను నిర్వహించారు.<
/p>

Read more RELATED
Recommended to you

Latest news