వనపర్తిలో ఘోరం.. పిడుగుపాటుకు మహిళ మృతి

-

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల పిడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే పిడుగుపడి మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి రూరల్ ఎస్ ఐ జలంధర్ రెడ్డి కథనం ప్రకారం.. వనపర్తి మండలం చిమనగుంట పల్లికి చెందిన గొర్రెల కాపరి గొల్ల పద్మ(35) పిడుగుపాటుకు గురై సుమారు నాలుగు గంటల సమయంలో మృతి చెందిందని తెలిపారు.

బాధితురాలి భర్త యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు.కాగా మృతురాలికి ఒక పాప, ఒక కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలాఉండగా, రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండగా పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇప్పటికే హుస్సేన్ సాగర్ నిండుకోగా, తూముల ద్వారా నీటిని కిందకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version