మెగా ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్…!

-

టాలీవుడ్ లో చిరంజీవి సినిమా కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే పనులు మానుకుని మరీ చూసే ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి ఫాన్స్ కి ఆయన సినిమా విషయంలో ఆందోళన మొదలయింది. ఆయన సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యా అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా ఒక దాని తర్వాత ఒక అడ్డంకి మొదలయింది. ముందు హీరోయిన్ విషయంలో అనేక ప్రయత్నాలు చేసింది చిత్ర యూనిట్. అయినా సరే హీరోయిన్ ఎవరు అనేది స్పష్టత రావడం లేదు. అనుష్క, కాజల్, త్రిష ఇలా అందరూ సీనియర్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినా ఎవరూ ముందుకి రావడం లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా కు కరోనా దెబ్బ తగిలింది. ఈ సినిమా షూటింగ్ లో కీలక భాగాన్ని మహారాష్ట్ర అడవుల్లో చెయ్యాల్సి ఉంది.

అయితే కరోనా వైరస్ కారణంగా అక్కడ షూటింగ్ వద్దని చిరంజీవి చెప్పినట్టు సమాచారం. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు ఎప్పుడు సినిమాను విడుదల చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. కనీసం సినిమా షూటింగ్ ఎప్పుడు తిరిగి మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ముందు వేసవిలో విడుదల చేస్తారని భావించినా వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news