పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ….. మరింత ఆలస్యం కానున్న పవన్ 26వ సినిమా…..??

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అజ్ఞాతవాసి సినిమా తరువాత తన సినీ లైఫ్ కు బ్రేక్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో సిల్వర్ జూబిలీ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి పై ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదీకాక అంతకముందు పవన్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మంచి హిట్స్ సాధించి ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వారి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయం అని వారు భావించారు. అయితే ఆ సినిమా అనూహ్యంగా అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టింది.

ఇక ఆ తరువాత పూర్తిగా తన రాజకీయ జీవితంలో బిజీ అయిన పవన్, ఇకపై సినిమాల్లో నటించనని తేల్చి చెప్పారు. అయితే అజ్ఞాతవాసి ఘోర పరాజయం కావడంతో పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ కోసం ఒక మంచి సినిమా చేయాలని కోరడం జరిగింది. కాగా ఎప్పటినుండో ఫ్యాన్స్ నుండి అభ్యర్ధనలు వింటున్న పవన్, ఎట్టకేలకు ఒక సినిమాలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ మరియు తాప్సి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పింక్ అనే సినిమా రీమేక్ లో పవన్ నటించడానికి సిద్ధం అయ్యారు. ఇదే సినిమాను ఇటీవల తమిళ్ లో అజిత్ హీరోగా తెరకెక్కించగా, ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తెలుగులో ఈ సినిమాను బోనీ కపూర్ మరియు దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్ద కోర్ట్ సెట్టింగ్ ని కూడా ప్రారంభించడం జరిగిందట. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉందట. దానికి కారణం పవన్ కళ్యాణే అని అంటున్నారు, వచ్చే ఏడాది మార్చి వరకు పవన్ కు రాజకీయాల పరంగా షెడ్యూల్ ఫుల్ బిజీ గా ఉందని, కావున అప్పటివరకు ఆయన అందుబాటులో ఉండరని సమాచారం. దీనిని బట్టి ఈ సినిమా మార్చి తరువాతనే ప్రారంభం అవుతుందని అంటున్నారు. అతి త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక మొదలవుతుందట. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news