బ్రేకింగ్ న్యూస్.. బాలసాయిబాబా కన్నుమూత

-

ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త బాల సాయిబాబా కన్నుమూశారు. బాబా హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు గత అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.

బాలసాయిబాబాది ఏపీలోని కర్నూలు జిల్లా. ఆయన తన జీవితమంతా ఆధ్యాత్మిక భోదనల కోసమే కేటాయించారు. ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ.. ఆయన మాత్రం తన ప్రవచనాలతో తన భక్తుల మనసులో ఆధ్యాత్మికతను నింపేవారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన మరణ వార్త విన్న బాబా అభిమానులు, ఆయన అనుచరులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news