బాలయ్యకు బుద్ధి లేదు.. టీడీపీకి సిగ్గు లేదు: వైసీపీ

-

ఓ అభిమానిపై ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఇవాల్టి నుంచి ఆయన ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య హెలికాప్టర్ దిగగానే అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఓ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించగా బాలకృష్ణ అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తోసేశారు.

అభిమానిని బాలకృష్ణ తోసేయడంపై వైసీపీ ఎక్స్(ట్విట్టర్) లో విమర్శలు గుప్పించింది. ‘బాలయ్య కు బుద్ధి లేదు.. టీడీపీకి సిగ్గులేదు అని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో అభిమానిపై హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేయి చేసుకున్నారు. గతంలోనూ ఆయన మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడినా, అభిమానులను కొట్టినా టీడీపీ వెనకేసుకొచ్చింది అని గుర్తు చేశారు. ఈసారి బాలయ్యకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఓటర్లు అంటున్నారు’ అని రాసుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news