వైసీపీ కి షాక్.. పార్టీని వీడనున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి..?

-

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో వైసీపీ కి బిగ్  షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి  పార్టీని వీడనున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా పార్టీ తీరు పై అసంతృప్తి లో ఉన్నారు మాజీ మంత్రి బాలినేని. దీంతో పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

వాస్తవానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికలకు ముందే జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. కానీ ఎన్నికల సమయంలో వైసీపీలోనే కొనసాగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గత కొంత కాలంగా ఆయన వైసీపీలో అసంతృప్తితోనే ఉన్నారు. నిన్న మాజీ సీఎం జగన్ తో కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల తరువాత కూడా అసంతృప్తిగా ఉండటంతో పార్టీ వీడనున్నట్టు ఖాయమైంది. ఒకవేళ ఆయన వైసీపీకి రాజీనామా చేస్తే.. మాత్రం ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ తో ఆయనకు మంచి సంబంధాలు ఉండటంతో జనసేన పార్టీలోనే చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news