కిషన్ రెడ్డి తెలంగాణ దద్దమ్మ.. మోడీ దేశం పాలిట ప్రజాకంఠకుడు – బాల్క సుమన్

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దద్దమ్మ లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ప్రభుత్వాలను పడగొట్టడం లో బీజేపీ కున్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవడం లో లేదని.. కిషన్ రెడ్డి తెలంగాణ పాలిట దద్దమ్మ అయితే మోడీ దేశం పాలిట ప్రజాకంఠకుడు అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.


బీజేపీ దొంగల ముఠా గా తయారైందని.. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట వసూళ్ల కు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగుతున్నారని నిప్పులు చెరిగారు బాల్క సుమన్‌. బీజేపీ నేతల వసూళ్ల పర్వాన్ని పార్లమెంటు సాక్షిగా ఎండగడుతామని హెచ్చరించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ కు చేసిన దేమిటో చెప్పాలి.. కేసీఆర్ ను తిట్టడానికి పరిమితమయితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్‌ ఇచ్చారు. దేశమంతా బై బై మోడీ అంటున్నారు. ఇకనైనా బీజేపీ నేతలు సిగ్గుపడి బుద్ది తెచ్చుకోవాలని చురకలు అంటించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.

Read more RELATED
Recommended to you

Latest news