అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

-

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది ఏపీ ప్రభుత్వం. రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం అమరావతి పరిధిలో ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంది. సిఎస్ సమీర్ శర్మ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పని చేయాలన్న సర్కార్.. జూన్ 27 నుంచి ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంపై సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని మరో రెండు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జులై 1 లోపు ఫ్లాట్ లను వదిలి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉన్నఫలంగా ఆదేశాలు రావడంతో అమరావతిలోని ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతి మేరకు ఉచిత వసతి సదుపాయం మరో రెండు నెలల పాటు పొడిగించింది. నివాసాలను సౌకర్యవంతంగా ఉండాలని.. ఏమైనా జరిగినా ఉద్యోగులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news