పదేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ లబ్ది పొందింది బీఆర్ఎస్: బల్మూరి వెంకట్

-

పదేళ్ల నుండి BRS పార్టీ ప్రజలని మభ్యపెడుతూ రాజకీయ లబ్ధి పొందిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బల్మూరి వెంకట్, మహిళ నాయకులు కార్యకర్తలతో అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకి కారణమైన మాజీ మంత్రి హరీష్ రావు అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి మలినం చేశారని పసుపు నీళ్లతో ఆ మలినాన్ని శుద్ధి చేశామని బల్మూరి వెంకట్ అన్నారు.

ఆగస్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు హరీష్ తన రాజీనామాతో కొత్త డ్రామా కి తెర తీస్తున్నారని, హరీష్ రావుకి గత పదిహేళ్లుగా అమరవీరుల గుర్తుకు రాలేదా అని అడిగారు రాజీనామా లేఖ ని ఏ విధంగా పంపాలో కూడా హరీష్ రావుకి అవగాహన లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news