హరీశ్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

-

తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా లేఖను వృదా కానివ్వమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరవీరుల చావుకు కారణమైన హంతకుడు హరీశ్ రావు అన్నారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టన పెట్టుకున్న వ్యక్తి హరీశ్ రావు అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతానికి మైల పడిందన్నారు.

హరీశ్ రావు బీఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమేనని.. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతామన్నారు. హరీశ్ రావు స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారన్నారు. హరీశ్ రావు రాజీనామా లేఖ వృదా కానివ్వమని తెలిపారు. ఆగస్టు 15 తరువాత కచ్చితంగా రాజీనామాను ఆమోదించే బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసిన నువ్వు.. రాజీనామా ఎలా చేయాలో కూడా తెలియదా..? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు ఆడుతున్నావన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news