రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్.. మంత్రి పదవి, వంద కోట్ల ఆఫర్ : బండి సంజయ్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి, వందల కోట్ల ఆఫర్ ను కేసీఆర్ ప్రకటించారని ఆరోపించారు. నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేటలో ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో కేసీఆర్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందని అందుకే లెఫ్ట్ పార్టీ మద్దతు కూడగట్టున్నారని.. ఇంకా భయం పోక.. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేశారని ఆరోపణలు చేశారు.

ఓటమి భయంతోనే కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్ అన్నారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరకముందు ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. టీఆర్ఎస్ లో చేరితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవితో పాటు.. వందల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. అయినా రాజగోపాల్‌రెడ్డి ఆ ఆఫర్‌ను తిరస్కరించి.. మంచి కోసం పనిచేసే బీజేపీలో చేరారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news