తెలంగాణలోని మసీదులపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలోని మసీదులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఉత్తరాదికే పరిమితమైన మందిర్-మసీదు వివాదాన్ని బండి సంజయ్ తెలంగాణకు తీసుకొచ్చారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… తెలంగాణలో ఉన్న మసీదులన్నింటినీ తవ్వాలని… తవ్వకాల్లో శవం వస్తే ఆ మసీదును మీకే వదిలేస్తామని, శివలింగం వస్తే మేము తీసుకుంటామని బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని, ఇక్కడున్న మసీదులను తవ్వినా శివలింగాలు వస్తాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను మూసేస్తామని తెలిపారు. మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి పట్టిన శనిని వదిలిస్తామని, రామరాజ్యాన్ని స్థాపిస్తామని అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version