మునుగోడు సభలో కేసీఆర్‌ ఆ ప్రకటన చేస్తాడు – బండి సంజయ్‌

-

కేసీఆర్‌ మునుగోడు సభ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జనగామ ఖిలాషాపూర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచి, ఉచిత కరెంటుకు ఎగనామం పెట్టేందుకే కేసీఆర్ కొత్త కుట్రకు దిగాడని ఆగ్రహించారు.

అధికారులు ఉద్యోగం చేయలేమని పారిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మోటార్లకు ఉచిత కరెంటు ఇచ్చి ఇళ్లకు రెట్టింపు ధరలు పెంచారన్నారు. ముఖ్యమంత్రి అనిలోచిత విధానలే దీనికి కారణమని వెల్లడించారు. తెలంగాణ డిస్కలం ర్యాంకు ఎంత అని ప్రశ్నించారు. ఎన్టీపీసీ, విద్యుత్ సంస్థల అప్పులెంత.. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ బహిరంగ సభలో ఇదే మాట్లాడతారని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version