బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు వణుకు పుడుతోంది : బండి సంజయ్

-

బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ అభివ్రుద్ధికి ఎంపీ నిధులు కేటాయిస్తానని.. ప్రజల అభివ్రుద్ది, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

రాజకీయ విమర్శలు,ప్రతి విమర్శలు సహజమని… అభివ్రుద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే కుట్రలు చేస్తున్నారని.. బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులన్నీ సీఎం డైరెక్షన్ లో పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నాయని.. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని అగ్రహించారు.

గతంలో నల్గొండ, కరీంనగర్ లో నాపైనా ఆర్మూర్ లో ఎంపీ అరవింద్ పై దాడి చేయడం, కార్యకర్తలపై హత్యాయత్నం చేయడం సీఎం కుట్రలో భాగమేనని.. నిన్న ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నాగేశ్వర్ రావు అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి హత్య చేసేందుకు కుట్ర చేశారన్నారు. బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని భయానక వాతావరణం స్రుష్టించాలనుకుంటున్నాడని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version