బండ్ల గణేష్ ఆ ఫ్యామిలీలకు క్షమాపణ చెప్పాల్సిందేనా..?

-

బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో పలు సినిమాల ఈవెంట్లకు దూరంగానే ఉంటున్నారు. ఈయన సినిమా ఈవెంట్లకు హాజరైతే చాలు ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా జీవన్ రెడ్డి డైరెక్షన్ లో ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా రిలీజ్ వేడుకకు బండ్ల గణేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పూరి జగన్నాథ్ కుమారుడు చోర్ బజార్ సినిమా రిలీజ్ వేడుకకు పూరి జగన్నాథ్ హాజరుకాలేదు.

ఈయన ప్రస్తుతం జనగణమన సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. ఈ క్రమంగా పూరి జగన్నాథ్ ను ఉద్దేశిస్తూ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలను పరిచయం చేశారు ..డైలాగులు రానివారికి డైలాగులు చెప్పడం.. యాక్టింగ్ రాని వారికి కూడా యాక్టింగ్ నేర్పించి..మెగాస్టార్ , సూపర్ స్టార్ లను చేశారు కానీ తన కొడుకు సినిమా కోసం రావడానికి తీరిక లేదు అని పూర్తిగా తప్పు అంటూ కామెంట్ చేశారు. ఈ సమయంలోనే బండ్లగణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ చరణ్, మహేష్ సినిమాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని బండ్ల గణేశ్ ఇలా చేసి ఉంటారని వ్యాఖ్యలు ఇద్దరి హీరోల అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ను కూడా చేస్తున్నారు. మరి ఈ విషయం పై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో అనే విషయం తెలియాలి అంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. పూరి జగన్నాథ్ కేవలం హీరోలనే కాదు.. ఎంతో మంది హీరోయిన్లను సైతం సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కొంత మంది స్టార్ హీరోయిన్లు గా కూడా ఎదిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version