న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

-

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఎనిమిది వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించి కివీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసుకుంది బంగ్లా. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హుస్సేన్ కు దక్కింది. ఈ విజయంతో రెండు మ్యాచ్ ల సిరీస్ 1-0 తో ఆధిక్యంలో నిలిచింది.

రెండో ఇన్నింగ్స్ లో  39 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా… 16 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అయితే ఈ విజయంతో కివీస్ గడ్డపై బంగ్లాదేశ్ మూడు రికార్డులను నమోదు చేసుకుంది. కివీస్ గడ్డపై బంగ్లాదేశ్ కు ఇదే తొలి టెస్ట్ విజయం. 16 ఓటముల తర్వాత ఈ గెలుపు దక్కింది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇదే మొట్టమొదటి గెలుపు. 2001 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి ముప్పై రెండు మ్యాచ్లు అన్నిటిలోనూ ఓటమి చెందింది. విదేశీ గడ్డపై టాప్- 5 లో ఉన్న జట్టును ఓడించడం కూడా బంగ్లాకు ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news