ప్రభాస్ ఫాన్స్ కు బిగ్ షాక్.. “రాధేశ్యామ్” విడుదల వాయిదా

-

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యాం సినిమా అందరూ ఊహించినట్లే… వాయిదా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లను మూసి చేయాలంటూ పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.

ఇలాంటి నేపథ్యంలో జనవరి 14వ తేదీన విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేసుకున్నట్లు చిత్రబృందం కాసేపటి క్రితమే ప్రకటన చేసింది. అంతేకాదు ఈ సినిమాను వాయిదా వేసుకుని అందుకు ప్రభాస్ ఫ్యాన్స్ కు క్షమాపణలు కూడా చెప్పింది చిత్ర బృందం.

అలాగే ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామని… దానికి సంబంధించిన తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది చిత్ర బృందం. ఇక ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ రాధేశ్యామ్ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news