సోషల్ మీడియాలో వీడియో వైరల్… బార్ సీజ్ !

-

కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు రిజైన్ స్కై బార్ సీజ్ అయింది. తెలంగాణాలోని హైదరాబాద్ లో ఉన్న ఈ బార్ పై రైడ్ నిర్వహించిన ఎక్సయిజ్ శాఖ, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బార్లో పనిచేసే వెయిటర్లు మాస్క్ లు ధరించలేదని గుర్తించి సీజ్ చేసింది. బార్ కౌంటర్ దగ్గర పరిమితికి మించి జనం గుమిగూడారని నిర్ధారణకు వచ్చారు. నిజానికి సోషల్ మీడియాలో అక్కడి జగన్ గుమికూడి ఉన్న ఒక వీడియో వైరల్ అయింది.

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఈ వీడియో చేరింది. ఆ వీడియో ప్రకారం కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని స్పష్టం కావడంతో ఎక్సయిజ్ శాఖకు పంపి దర్యాప్తునకు ఆదేశించారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ఎక్సయిజ్ శాఖ దర్యాప్తు చేసి తెలంగాణా ఎక్సయిజ్ చట్టం సెక్షన్ 31 (1), 41, ఏపీ ఎక్సయిజ్ రూల్స్ 2005 లోని రూల్ 33, 38 ప్రకారం బార్ యాజమాన్యంపై కేస్ నెంబర్ 36/2020 నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version