రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను రక్షించాలి.. గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ కీలక లేఖ

-

బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు కీలక లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నేతలు, జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేస్తు్న్నారని లేఖ ద్వారా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను రక్షించాలని గవర్నర్‌ని కోరారు.కాగా, ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లేదని గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల నిరుద్యోగుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేత దాసోజు గవర్నర్‌కు కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news