బ్రేకింగ్ : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ : రోహిత్‌, కోహ్లీలకు రెస్ట్‌.. కెప్టెన్‌ గా రహానే !

-

ఇటీవలే టీ 20 ప్రపంచ కప్‌ టోర్నీ నుంచి వైదోలిగిన టీమిండియా… మరో సీరిస్‌ కు సిద్ధం అవుతోంది. నవంబర్‌ 17 వ తేదీ నుంచి న్యూజిలాండ్‌ జట్టుతో మరో టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే… న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ పాలక మండలి.

అయితే.. ఈ టెస్ట్‌ సీరిస్‌ కు భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కు పూర్తి గా దూరం కాగా… కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కి విశ్రాంతి ఇచ్చింది. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ కు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దూరం కానున్నారు. అయితే.. రెండో టెస్ట్‌ నుంచి మళ్లీ కెప్టెన్‌ గా విరాట్‌ కోహ్లీ బాధత్యలు చేపట్టనున్నాడు. అయితే.. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ కు రహానే కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులకు భారత జట్టు ఇదే :

ఎ రహానే (సి), సి పుజారా (విసి), కెఎల్ రాహుల్, ఎం అగర్వాల్, ఎస్ గిల్, ఎస్ అయ్యర్, డబ్ల్యు సాహా (డబ్ల్యుకె), కెఎస్ భరత్ (డబ్ల్యుకె), ఆర్ జడేజా, ఆర్ అశ్విన్, ఎ పటేల్, జె యాదవ్, ఐ శర్మ, యు యాదవ్, ఎండీ సిరాజ్, పి కృష్ణ

Read more RELATED
Recommended to you

Latest news