ఉన్న జుట్టును రాలగొట్టి…గుండు కొట్టిస్తా : బండి సంజయ్ కి దానం నాగేందర్ వార్నింగ్

-

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక పోవడంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే నేతలందరూ ఇవాళ ధర్నాకు దిగారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యే ల వరకు ఆయా నియోజక వర్గాల్లో రైతుల తరఫున ధర్నాలు చేస్తున్నారు. ఇక ఖైరతాబాద్‌ నియోజక వర్గంలో రైతుల తరఫున స్థానిక ఎమ్మెల్యే.. దానం నాగేందర్‌.. ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ, తెలంగాణ బీజేపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చాలా ఓవర్‌ గా మాట్లాడుతున్నాడని.. ప్రజలు అతనికి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. బండి సంజయ్‌ తల పైన ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా ఊడగొట్టి… గుండు గీయిస్తానని వార్నింగ్‌ ఇచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్‌. ఎంపీ అరవింద్‌ ను హైదరాబాద్‌ లో తిరగకుండా చేస్తామని హెచ్చిరించారు. బీజేపీ నేతలు తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు దానం నాగేందర్‌.

Read more RELATED
Recommended to you

Latest news