శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

-

ఇండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో వీరికి చోటు కల్పించలేదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయాల్లో దేశవాళీ క్రికెట్ ఆడాలని తాజా ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని వీరిద్దరికీ ఇటీవల బీసీసీఐ చురకలు అంటించింది. దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ కి మొండిచేయి ఎదురైంది.

బీసీసీఐ ప్రకటించిన క్రికెటర్ల రిటైనర్షిప్ లో గ్రేడ్ A+లో విరాట్ కోహ్లి,రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ Aలో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, kl రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా, గ్రేడ్ Bలో సూర్య కుమార్ యాదవ్, రిషబు పంత్, కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్, జైస్వాల్.. గ్రేడ్ Cలో రింకూ సింగ్, తిలక్వర్మ, రుతురాజ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, బిష్ణోయ్, జితేశ్, ప్రసిద్ధ కృష్ణ, అవేశ్ ఖాన్,సుందర్, ముకేశ్ కుమార్, సంజు శాంసన్, అర్ష్ దీప్, భరత్, రజత్ పాటీదార్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news