రష్మిక మందనతో ఎఫైర్ పై ఓపెన్ అయిన హీరో బెల్లంకొండ..!

-

వ్యవహారం : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటూ గత కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించకపోగా తాజాగా బెల్లంకొండ ఓపెన్ అయ్యారు..

నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పటి వరకు పలు హీరోలతో ఎఫైర్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రక్షిత్ శెట్టితో కొన్నాళ్లు ప్రామాయణం నడిపిన ఈ భామ ఎంగేజ్మెంట్ అనంతరం ఆ రిలేషన్ కు గుడ్ బై చెప్పయ్యగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఎఫైర్ ఉంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో కొన్ని రోజుల క్రితం బాలీవుడ్లో ఓ ఈవెంట్ కు కలిసి హాజరవ్వడంతో అప్పటినుంచి వీరి మధ్య ఏదో నడుస్తుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు సార్లు ఎయిర్పోర్ట్లో సైతం వీరిద్దరూ జంటగా కనిపించడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. కాగా ఈ విషయంపై స్పందించారు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

వ్యవహారం
వ్యవహారం

“రష్మికతో నేను డేటింగ్ చేస్తున్నాను అన్నమాట అబద్ధం. అసలు ఆమెను కలిసేదే తక్కువ. మేము స్నేహితులం మాత్రమే. వృత్తిరీత్యా తరచుగా హైదరాబాద్ నుండి ముంబై వెళుతూ ఉంటాము. ఆ టైం లో ఒక్కోసారి ఎయిర్ పోర్ట్ లో కలుస్తాము. మేము కలిసి ప్రయాణం చేసింది కూడా లేదు. రెండు మూడు సందర్భాల్లో ఇద్దరం పక్కపక్కనే కనిపించేసరికి పుకార్లు లేపారు. రష్మికతో స్నేహానికి మించి ఎలాంటి బంధం లేదు..” అంటూ చెప్పుకొచ్చారు ఈ హీరో..

వ్యవహారం
వ్యవహారం

ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియో నిర్మిస్తున్నాయి. మే 12న ఛత్రపతి విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సాయి శ్రీనివాస్ పాల్గొంటున్నారు. భారీ బడ్జెట్ తో తరికెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందంటూ క్లారిటీ ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news