వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు చేసిన పోలీసులు …!

-

దేశంలో అనేక మంది కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతుంటే… కొందరు మాత్రం అక్రమ మార్గాలు తొక్కుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మరో వ్యభిచార ముఠా బయటపడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని యశ్వంతపూర్ ఏరియాలో ఓ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతుందని సమాచారంతో పోలీసులు ఆ గెస్ట్ హౌస్ పై నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ వ్యభిచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారితో పాటు అక్కడే ఉన్న ఐదు మంది యువతులను రక్షించిన పోలీసులు వారిని రెస్క్యూ హోంకు తరలించారు.

sex-workers
sex-workers

ఈ రైడ్ కు సంబంధించిన వివరాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ తెలిపారు. ఇదే నేపథ్యంలో పోయిన వారంలో కూడా సీసీబీ పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారని తెలిపారు. అయితే ఆ సమయంలో ఏకంగా 27 మంది మహిళలను కాపాడి బెంగళూరు నగరంలోని రెస్క్యూహోంకు తరలించారు. ఒకవైపు బెంగళూరు నగరంలో కరోనా తీవ్రరూపం దాలుస్తుంది. మరోవైపు ఇలాంటి అసాంఘిక చర్యలు జరగడం ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news