దేశంలోనే అతి పెద్ద క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్, హైదరాబాద్ లో పట్టేసిన రాజస్థాన్ పోలీసులు !

-

హైదరాబాదులో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు చేసింది. ఆ సోడాలలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసిన చేసింది రాజస్థాన్ ఏటీఎస్ టీమ్. తెలంగాణ , ముంబై , ఢిల్లీ, రాజస్థాన్ కేంద్రంగా ఈ క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నట్టు గుర్తించారు. అలానే దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఈ ముఠా బెట్టింగ్ పాల్పడుతున్నట్టు గుర్తించారు.

ఇక సోదాల్లో ఏడుగురు సభ్యుల నుంచి 16 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్ కు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేష్ ను పట్టుకున్న పోలీసులు, ఆయనతో పాటు సురేష్ , పంకజ్, సత్తయ్య అనే వ్యక్తులతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్ ని ఈ ముఠా నడుపుతోందని తేలింది. అన్ని రాష్ట్రాల్లో ముఠాలను ఏర్పాటుచేసి గణేష్ బెట్టింగ్ నడుపుతున్నట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news