విడుదల కి 12 గంటల ముందే నితిన్ భీష్మ సినిమా కి బిగ్ బ్రేకింగ్ న్యూస్ !

-

ఒకానొక సమయంలో వరుస విజయాలు సాధించిన యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కుర్ర హీరో నాగ శౌర్య కి ‘ఛలో’ తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములుతో కలిసి భీష్మ సినిమా చేయడం జరిగింది. ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. Image result for bhishma nithinసంక్రాంతి పండుగకు వచ్చిన ‘అలా వైకుంఠపురం లో’ సినిమా తర్వాత విడుదలైన ఏ తెలుగు సినిమా కూడా ఇప్పటి వరకు ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో నితిన్ నటించిన ‘భీష్మ’కి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సూపర్బ్ కలెక్షన్స్ వచ్చే పరిస్థితి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెలకొంది. అలాగే థియేటర్స్ లో పెద్దగా సినిమాలేవీ లేనందు వల్ల భీష్మ సినిమా ఆంధ్ర – తెలంగాణలో సుమారు 550 నుంచి 600కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది.

అయితే అంతా బాగానే ఉన్నా గాని కొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో విడుదలకు 12 గంటల ముందే సినిమా కొన్న బయ్యర్లు సినిమాకి నష్టం వస్తే మీరు కొంత సొమ్ము మాకు ఇవ్వాలి అని సినిమా నిర్మాతలను డిమాండ్ చేసినట్లు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇండస్ట్రీ లో వినపడుతోంది. విషయంలోకి వెళితే సినిమాకి సరిగ్గా ప్రమోషన్ చేయని నేపథ్యంలో సినిమా కొన్న బయ్యర్లు ఈ విధమైన కామెంట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. 

Read more RELATED
Recommended to you

Latest news