బంగారు టీ పొడి.. కిలో రూ.2.5 లక్షలు

-

ఛాయ్ అంటే ఇష్టం లేని వాళ్లుండరు. కాఫీపై ఎంత మోజుపడినా.. టీ అనగానే జై కొట్టేవాళ్లు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా ఆర్గానిక్ టీకి లవర్స్ ఎంతో మంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన టీ పొడికి ఆదరణ పెరుగుతోంది.

అసోంకు చెందిన ఆరోమికా టీ అనే అంకుర సంస్థ 40 రకాల వైవిధ్యమైన రుచులను అందిస్తోంది. అందులో ఒకటి.. తాగేందుకు అనువైన 24 క్యారెట్ల బంగారం జత చేసిన బ్లాక్‌టీ పొడి. దీని ధర కిలో రూ.2.5 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఘాటు మిరపకాయ అయిన ‘భూత్‌ జోలాకియా’ రుచితో సిద్ధం చేసిన పొడిని కూడా రూపొందించినట్లు ఆ కంపెనీ అధికారి రంజిత్‌ బారువా పేర్కొన్నారు. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో వినియోగదారులకు ఆరోగ్య స్పృహ పెరగడంతోపాటు ప్రత్యేక రుచుల కోసం ఎదురుచూస్తున్నారని.. అలాంటి వారి కోసమే ‘ఆరోమికా టీ’ బ్రాండ్‌ కింద 40కి పైగా ప్రత్యేక, విలాసవంత రుచులను సృష్టించామని తెలిపారు.

‘భూత్‌ జోలాకియా లేదా ‘ఘోస్ట్‌ పెప్పర్‌’ రుచితో అందిస్తున్న టీ కోసం పేటెంట్‌కు దరఖాస్తు చేశాం. దీంతో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయ’ని పేర్కొన్నారు. కాస్టస్‌ ఇగ్నిస్‌ మొక్క ఆకులతో చేసిన ప్రత్యేక ‘ఇన్సులిన్‌’ టీ పొడినీ కనిపెట్టినట్లు తెలిపారు. ఇది శరరీంలో చక్కెర స్థాయులను స్థిరపరుస్తుందని అంటున్నారు. ‘మోరింగా’, ‘తులసి’ రకాల పొడితో ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version