మూడు రోజుల పోలీసు కస్టడీకి బిభవ్ కుమార్‌

-

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

4 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగిసింది.దీంతో ఆయనను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టగా ఇరుపక్షాల వాదనలు విన్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మే 31 వరకు కస్టడీకి అనుమతించింది.సోమవారం విచారణ సందర్భంగా హాజరైన స్వాతి మలివాల్ తనకు బెదిరింపులు వస్తున్నాయని నిందితునికి బెయిల్ ఇవ్వద్దని వాదించారు.కాగా, మే 13న కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మలివాల్‌ ఆయన ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ కుమార్‌ దాడికి పాల్పడ్డాడని దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఎన్నికల జరుగుతున్న తరుణంలో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో మే 18న కుమార్‌ని అరెస్టు చేశారు. బెదిరింపుకు పాల్పడటం, దాడి చేయడం, మహిళను వేధించడం, నేరపూరిత హత్యకు ప్రయత్నించడం వంటి నిబంధనల కింద బిభవ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news