ఈవీఎం ధ్వంసం కేసు..ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి

-

ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన పిన్నెల్లి బెయిల్ షరతుల ప్రకారం ఎస్పీ ఆఫీస్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు.

కాగా, ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే .పోలీసుల కళ్లు గప్పి తిరుగుతూనే పిన్నెల్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5వ తేదీ వరకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు ప్రతి రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని ఆదేశించింది. కోర్టు ఆర్డర్‌తో ఎట్టకేలకు ఇవాళ ఎస్పీ కార్యాలయానికి అజ్ఞాతం వీడి బయటకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు నరసరావుపేటలో భారీగా పోలీసులను మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news