బిగ్ బ్రేకింగ్; ఏపీలో మరో 12 పాజిటివ్

-

ఆంధ్రప్రదేశ్ లో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 161 కి చేరుకుంది. నెల్లూరులో అత్యధికంగా 8 కేసులు నేడు నమోదు అయ్యాయి. వీరు అందరూ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీనితో ఒక్కసారిగా ప్రజల్లో భయం మొదలయింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత నాలుగు రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

నాలుగు రోజుల్లో 140 కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలయింది. ప్రభుత్వం అప్రమత్తమైంది.చిత్తూరు జిల్లా నుంచి 46 మంది ఢిల్లీ వెళ్ళారు. చిత్తూరు నుంచి మూడు చోట్లకు ప్రార్ధనలకు వెళ్ళారు. కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ కి ప్రార్ధనలు చేయడానికి మొత్తం 185 మంది వెళ్ళారు. వీరు అందరిని ఇప్పుడు అధికారులు గుర్తించి క్వారంటైన్ కి తరలించారు. కృష్ణా జిల్లాలో 23 పాజిటివ్, గుంటూరు లో 20 పాజిటివ్, పశ్చిమ గోదావరి 15, పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చాపకింద నీరులా ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news