బిగ్ బ్రేకింగ్; ఏపీలో భారీగా కరోనా కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 67 కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదు కాగా నేడు అప్పుడే 21 కేసులు ఉదయం 11 గంటల లోపే బయట పడ్డాయి. నిన్న సాయంత్రం 111 కి చేరుకున్న కరోనా కేసులు నేడు 132 కి చేరుకున్నాయి. కృష్ణా జిల్లాలో 15 కేసులు, కడప 15, ప్రకాశం 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదు అయ్యాయి. విశాఖ లో 11 కరోనా కేసులు, చిత్తూరు జిల్లాలో 8 కేసులు తూర్పు గోదావరి జిల్లాలో 9 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం జిల్లాలో 2 కేసులు నెల్లూరులో 20 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదు అయింది. విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కేసులు నమోదు కాలేదు. తెలంగాణాను ఆంధ్రప్రదేశ్ బీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news