బిగ్ బ్రేకింగ్; ఏపీలో భారీగా కరోనా కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 56 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. నిన్న కూడా అదే స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో నమోదు అయిన కేసుల సంఖ్య ఇదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 813 మందికి కరోనా వచ్చింది. గుంటూరు జిల్లాలో 19 కేసులు, కర్నూలు జిల్లాల్లో 19 కేసులు వచ్చాయి.

ఈ కేసులు అన్నీ కూడా ఆరు జిల్లాల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఏపీ లో 24 గంటల్లో కరోనా తో ఇద్దరు మరణించారు. చిత్తూరు ఆరు, ప్రకాశం నాలుగు, కృష్ణా జిల్లా లో 3 కేసులు, కడప జిల్లాలో 5 కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 177 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

Read more RELATED
Recommended to you

Latest news