”భోళా శంకర్‌” నుంచి మరో అప్డేట్‌.. చిరుకి రాఖీ కట్టిన కిర్తీ సురేష్‌

-

మెగాస్టార్‌ చిరంజీవి 154 వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ ఉదయం వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22 న మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ మెహర్‌ రమేష్‌ దర్శకత్వం లో వేదాళం రీమేక్‌ కు సంబంధించిన అప్‌ డేట్‌ ను ప్రకటించారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాకు బోళా శంకర్‌ అనే టైటిల్‌ కు ను ఖరారు చేశారు.

ఈ పోస్టర్‌ ను ఇవాళ ఉదయం మహేష్‌ బాబు విడుదల చేయగా… తాజాగా సినిమా నుంచి మరో అప్‌ డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా లో చిరంజీవి చెల్లెలు గా కీర్తి సురేష్‌ నటిస్తున్నట్లు ప్రకటిస్తూ… ఓ వీడియో ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వీడియో లో మెగాస్టార్‌ చిరంజీవికి కీర్తి సురేష్‌ రాఖీ కడుతూ… చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతుంది. అలాగే చిరంజీవి… కిర్తీ సురేష్‌ కు స్వీట్‌ తినిపిస్తూ…తన ఆప్యాయతను తెలుపుతాడు. కాగా.. భోళా శంకర్ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news