Bigg Boss-8 : బిచ్చగాళ్లకు వేసినట్లు వేసింది.. ప్రేరణ దోస వేసిన పద్ధతి నచ్చలేదని ఏడ్చేసిన విష్ణుప్రియ!

-

బిగ్‌బాస్ తెలుగు సీజన్ -8 సెప్టెంబర్ 18వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రసారమయ్యే ప్రొమో విడుదలైంది. ఇందులో యాంకర్, డాన్సర్ విష్ణుప్రియ ఫుడ్ విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చేసింది. కంటెస్టెంట్ ప్రేరణ కిచెన్‌‌లో తనతో వ్యవహరించిన తీరు నచ్చలేదని, బిచ్చగాళ్లకు వేసినట్లు తనకు ప్లేట్లో దోస వేసిందని, ఆ విధానం తనకు బాధకలిగించిందని, ఎవరికైనా ఆకలేగా అని విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యింది.

ప్రస్తుతం మూడో వారం రేషన్ టాస్క్ జరుగుతోంది.సెప్టెంబర్ 17న ఎపిసోడ్‌లో బెలూన్ టాస్క్‌లో ఫైట్ చాలానే అయ్యింది. సంచాలక్‌గా ఉన్న సోనియా తన టీమ్‌కు ఫేవర్‌గా చేసిందని యష్మీ ఫైర్ అయింది.దానిని కొనసాగింపుగా బిగ్‌బాస్ సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ‘స్టిక్స్ విరిగిపోతే గేమ్ ఆపాలని సంచాలక్‌ చెప్పారు. కానీ, మీరు ఆగలేదు. మీ సంచాలక్ బెలూన్స్‌ను బాక్స్‌లోకి పంపకుండా ఎందుకు సైలెంట్‌గా ఉంది’ అని నిఖిల్‌తో గొడవ పెట్టుకుంది యష్మీ. గట్టిగా అరవకు అని నిఖిల్ అనగా.. నేను అలాగే అరుస్తానని యష్మీ అనగా.. అయితే, పక్కకు వెళ్లి అరువు, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని నిఖిల్ ఫైర్ అయ్యాడు. అలా ఇద్దరూ సోనియా విషయంలో గొడవపడ్డారు.

ఇకపోతే విష్ణుప్రియ ఏడుస్తూ దర్శనమిచ్చింది.ఏమైందని అంతా అడుగగా.. ‘ఫుడ్ విషయంలో ప్రేరణ విధానం నచ్చలేదని, ఆమె దోస ప్లేట్లో వేసేటప్పుడు అడుక్కునే వారికి వేసిచ్చినట్లు ఇచ్చిందని విష్ణుప్రియ బాధపడింది. ‘విసిరేసినట్లుగానా’ అని నిఖిల్ అన్నాడు. అయితే, కాదురా..ఎవరికైనా ఆకలే కదా’ అని విష్ణుప్రియ ఏడ్చేసింది. ‘తీసుకో.. తీసుకో పో’ అని అన్నానా? అని ప్రేరణ చెప్పుకొచ్చింది. ‘తను ఇలా వేసిచ్చిందా లేదా.. నువ్ చూశావ్ కదా’ అని మణికంఠను విష్ణుప్రియ అడిగింది. కట్ చేస్తే ప్రేరణ, విష్ణుప్రియ కూర్చుని ఉండగా.. ఇలాంటి యాటిట్యూడ్ నాకు చూపించకు ప్లీజ్’ అని ప్రేరణతో మణికంఠ అన్నాడు.అయితే, ఏమైనా చేసుకో పో..పో..’ అని ప్రేరణ రూడ్‌గా బదులిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version