Bigg Boss Telugu 8 : కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ.. ప్రేరణ అలా చేసే సరికి తట్టుకోలేక..!

-

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పుడు 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. పోయిన వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకీ హౌస్ లో గొడవలు ఎక్కువైపోతున్నాయి. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా రేషన్ కోసం మూడు గేమ్స్ పెట్టారు. సంచాలకులుగా వ్యవహరించిన మణికంఠ, ప్రేరణ, సోనియా పై అరిచేసారు. ఇదిలా ఉండగా మళ్లీ కొత్త రచ్చ మొదలైంది. ప్రేరణ ప్రవర్తన వలన విష్ణు ప్రియ కన్నీళ్లు పెట్టుకుంది.

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఇదే విషయం జరుగనుంది. 16 రోజులు పూర్తి చేసుకున్న బిగ్బాస్ 8 నుంచి బెబక్క, శేఖర్ భాషా వెళ్లిపోయారు. ఈ వారం ఇప్పటికీ నామినేషన్స్ పూర్తయ్యాయి ఎనిమిది మంది లిస్టులో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలీదు. ఇదిలా ఉంటే ప్రేరణ తనకి ఫుడ్ ప్లేట్లో వడ్డించకుండా విసిరేస్తుందని విష్ణు ప్రియ చాలా బాధపడింది.

మిగతా వాళ్ళు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ గొడవ మధ్యలో దూరిన మణికంఠ ఆమెకు ఆటిట్యూడ్ తగ్గించుకోమని చెప్పబోయాడు ఏమైనా చేసుకో పో అని ప్రేరణ చెప్పడానికి ప్రోమోలో చూపించారు. బుధవారం ఎపిసోడ్లో ఈ గొడవ ఎక్కువ హైలైట్ అయ్యేటట్టు కనబడుతోంది. ఈ వారం గేమ్స్ తో పాటు ఏడుపులు అరుపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈరోజు ఎపిసోడ్ లో ప్రేరణ, విష్ణు ప్రియ, మణికంఠల మధ్య ఏం జరుగుతుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version